టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్బస్టర్ హిట్స్తో స్పీడ్మీదున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ తర్వాత ఐదు నెలల విరామానంతరం బాబి దర్శకత్వంలోని సినిమా నేడు ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయం లో ఘనం గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేసారు. దేవుని చిత్రపటాల పై తొలి షాట్ కు వి. వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.ఈ పూజా కార్యక్రమాలకు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, వివి వినాయక్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చిత్ర దర్శకుడు బాబీకి మూవీ స్ర్రిప్ట్ను అందజేశారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, భోగవల్లి ప్రసాద్, యలమంచిలి రవి శంకర్, కిలారు సతీష్, ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగ వంశీ తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన నాయికగా రాశిఖన్నా కన్ఫమ్ అయింది. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 15 నుండి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఏడాది ద్వితీయార్థంలో సినిమా రిలీజ్ చేయనున్నారు. రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మూవీకి `జై లవ కుశ` అనే టైటిల్ ను పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే.
నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ-“సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై #NTR27 చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ లో ని స్టార్ కి , నటుడు కి న్యాయం చేసే విధంగా ఉంది. ఫిబ్రవరి 15 నుండి చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది“ అని తెలిపారు