గానగంధర్వుడు, నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు హీరోల్ని ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలు మాట్లాడుతూ-“తెలుగు హీరోలకు జాతీయ అవార్డ్లు రావడంలేదని గోల చేసే అభిమానులు… ఆ స్థాయిలో సినిమాలు ఎందుకు తీయడం లేదు?. హీరోలు భాష కోసం, జాతి కోసం, మీ కోసం కనీసం ఒక్క సినిమానైనా చేయండి“ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలుగువాళ్లకు ఐక్యత, అంకిత భావం లేదని కామెంట్ చేశారు.
సినిమాల స్థాయిని నిర్ణయించేది ప్రజలు. మిథునం లాంటి సినిమాకు థియేటర్లే దొరకలేదు. పెద్ద సినిమాలొస్తే చిన్న సినిమాల్ని తీసేస్తారు. ఇందుకు కారణాలేంటో ఆలోచించాలి.. అనీ బాలు వ్యాఖ్యానించడం ప్రస్తుతం పరిశ్రమలో చర్చకొచ్చింది.