సూపర్ స్టార్ మహేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిన విషయమే. ‘అతడు’,’ఖలేజా’ తర్వాత మూడో సారి ఈ కాంబినేషన్ తో ‘శ్రీమంతుడు’,’జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన మైత్రి మూవీస్ సినిమా చేయనుంది. కాకపోతే పైన చెప్పిన షూటింగ్ ఈ సినిమాకి సంబంధించింది కాదు. ‘లాయిడ్’ ఏ.సి కోసం మహేష్ తో త్రివిక్రమ్ నిన్న ఒక యాడ్ చిత్రీకరించారు. దీనికి వీ.మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలవుతుంది. దీని తర్వాత త్రివిక్రమ్ సెప్టెంబరు నుండి యంగ్ టైగర్ యన్.టి.ఆర్ తో చేయబోయే సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఉంటుంది. ఈ సినిమాని నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ నిర్మాతలుగా ‘మైత్రి మూవీస్’ బ్యానర్ మీద
నిర్మిస్తారు.