హృదయ కాలేయం సినిమాతో సక్సెస్ అందుకొని ఒక్కసారి సినీ లవర్స్ ని ఆకర్షించిన చిత్ర యూనిట్ రెండవసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. సాయి రాజేష్ నిర్మాతగా రూపక్ రోనాల్డ్సన్ దర్సకత్వంలో తెరకెక్కిన సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట పాజిటివ్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయాన్ని చిత్ర యూనిట్ విజయయాత్ర తో అభిమానులతో పంచుకుంటోంది.
ఈ రోజు కర్నూలు, అనంతపూర్, ప్రొద్దుటూరూ ప్రాంతాలలో సంపూర్ణేష్ బాబు అలాగే చిత్రంలో నటించిన నటీనటులు కొంతమంది టెక్నీషియన్స్ థియేటర్స్ లోకి వెళ్లి అభిమానులతో సినిమాను చూశారు. ఇక రేపు తిరుపతి, నెల్లూరు మరియు కావలి వస్తున్నట్లు సంపూర్ణేష్ బాబు తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ.. “సదా మీ ప్రేమకి బానిస: సంపూర్ణేష్ బాబు” అని పేర్కొన్నారు.