తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎందరో నిర్మాతలు ఉన్నారు కానీ అభిరుచి గలా నిర్మాతలు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అశోక్ వల్లభనేని ఈ కొదిమంది నిర్మాతలతో ఒక్కరు.
అశోక్ వల్లభనేని తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని ప్రముఖులతో ఒక్కరు. ఆయన నిర్మాతగా వేయహరించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. నాని తో సెగ, గౌతమ్ మేనాన్ ఎర్ర గులాబీలు ఇలా మంచి మంచి సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అలాగే చలో, గరుడ వేగా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఫైనాన్స్ అందించి తన అభిరుచిని చాటుకున్నారు. పెద్ద నిర్మాతలు ఆయనను లక్కీ హాండ్ గా భావించి వాళ్ల సినిమాలకి ఆయన చేత్తో ఫైనాన్స్ తీసుకుంటారు. అలా ఆయన చేతితో ఫైనాన్స్ తీసుకున్న ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇప్పుడు మరో భారీ చిత్రం తో తెలుగు ప్రేక్షకులు ముందుకు త్వరలో వస్తున్నారు.
సంచాలనల దర్శకుడు మణి రత్నం దర్శకత్వం లో తమిళం లో ‘చెక్క చీవంత వాణం’. తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదలకు సిద్ధం గా ఉంది. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితి రావ్ హైదరి, జయసుధ, ప్రకాశ్రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు రిలీజ్ హక్కులు మన అశోక్ వల్లభనేని భారీ రేట్ కు సొంతం చేసుకున్నారు. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందిస్తున్నారు.
భారీ స్థాయి లో నిర్మించబడ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో సెప్టెంబర్ 25న ఏర్పాటు చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మణిరత్నం, ఎ.ఆర్. రెహమాన్ విచ్చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలో సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.