కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్.
ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తతకు ముందుకు వచ్చిన బాహుబలి, దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ దత్తత తీసుకున్న ప్రభాస్.
ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్.
తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతం అభివృద్ది చేయనున్న ప్రభాస్.
రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత.
ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన, మొక్కలు నాటిన సంతోష్, ప్రభాస్.
వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించిన ప్రభాస్ త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపిన ఎం.పీ సంతోష్ కుమార్.
కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది.