నేనింతే శియా గౌతమ్ లేడి ఓరియంటెడ్ సినిమా త్వరలో ప్రారంభం !!!

0
250

కెఎల్ఎన్ క్రియేషన్స్ క్రియేటివ్ క్యారెక్టర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాలో నేనింతే సినిమా హీరోయిన్ శీయా గౌతమ్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు మరో మహా భారతం టైటిల్ ను ఖరారు చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీకి లక్ష్మీ నారాయణ కిల్లి మరియు రామకృష్ణ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here