సుధీర్ బాబు, మెహ్రీన్ మరియు రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ప్రారంభం..!!

0
390

యంగ్ హీరో సుధీర్ బాబు కొత్త సినిమా నేడు రామానాయుడు స్టూడియో లో ఘనం గా ప్రారంభమయ్యింది.. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వివి నాయక్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ విచ్చేసారు.. కాగా వివి వినాయక్ సినిమాలో వచ్చే మొదటి సీన్ ఫస్ట్ షాట్ కి గౌరవ దర్శకత్వంలో వహించగా నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు.. ప్రముఖ రచయిత కెమెరా ని స్విచ్ ఆన్ చేసారు.. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.. పీవీ శంకర్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నరేష్ వికె, పోసాని కృష్ణ మురళి మరియు ప్రగతి లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పతాకం పై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..

నటీనటులు: సుధీర్ బాబు, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వికె, పోసాని కృష్ణ మురళి, ప్రగతి

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: పులి వాసు
నిర్మాత: రిజ్వాన్
బ్యానర్: రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్
సహ నిర్మాత: ఖుర్షీద్ (కుషి)
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీఓపీ : పి.వి శంకర్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి
కో డైరెక్టర్స్: డి. రాజేంద్ర, రవి
సాహిత్యం: కేకే
ప్రొడక్షన్ కంట్రోలర్: రషీద్ అహ్మద్ ఖాన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు
పి.ఆర్.ఓ : వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here