‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య డి.వీ.వీ ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఇటీవలే కొరటాల శివ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు సూపర్ ట్యూన్స్ ఫైనలైజ్ చేసినట్టు తెలిసింది. కొరటాల శివ కెమరామెన్ రవి కే చంద్రన్ తో కలిసి అటునుండి లొకేషన్స్ ఫైనలైజ్ చేయడానికి లండన్ వెళ్లారు.